అత్వెలి మహిళ హత్య కేసును చేదించిన మేడ్చల్ పోలీసులు
మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వేల్లి గ్రామంలో ఈ నెల 16వ తేదీన జరిగిన మహిళ హత్య కేసును మేడ్చల్ పోలీసులు చేదించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డిసిపి కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు.మేడ్చల్ బస్టాప్ పరిసరాల్లోని సాంకేతిక ఆధారాలు, సిసిటివి ఫుటేజ్ల ద్వారా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.నిందితుడు కటికే రాకేష్ ( 24 ) లేబర్ గా పనులు చేస్తూ దిల్ సుఖ్ నగర్ కు చెందిన వాడు అని అతని వద్ద నుండి బంగారు చెవిపోగులు,ముక్కుపుడక లు: 05 గ్రాములు,వెండి కడియాలు వెండి బ్రాస్లెట్, వెండి ఉంగరం: 60 గ్రాములు.నగదు రూ. 3,500/-లను నిందితుని నుండి రికవరీ చేశామని డిసిపి కోటిరెడ్డి తెలిపారు. అతి తక్కువ సమయంలో ఈ కేసును చేదించినందుకు పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి శంకర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ, డి ఐ సుధీర్ కృష్ణ, ఎస్సైలు మన్మధరావు, అశోక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments