కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?

కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?

IMG-20250521-WA1745నడిరోడ్డుపై తెరిచి ఉన్న మ్యాన్ హోల్ 

పూర్తిగా పూర్తి చేసేది ఎన్నడో

స్థానికులకు ఇబ్బందికరంగా మారిన సగం రోడ్డు ఇలాంటి సగం పనులు మునుపు ఎన్నడూ చూడలేదు బుగ్గోని గూడ గ్రామస్తులు

షాద్ నగర్ ప్రతినిధి మే 21 నగర నిజం : నందిగామ మండల పరిధిలోని చేగూరు ఉమ్మడి గ్రామపంచాయతీ బుగ్గోనీగూడ గ్రామంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? నిధుల కోరతానా! అసంపూర్తిగా రోడ్డు పనులు. పూర్తి చేసేది ఎన్నడో, మ్యాన్ హోల్ తెరిచి ఉండడంతో చిన్నపిల్లలకు ప్రమాదంగా మారింది. వివరాల్లోకి వెళితే బుగ్గోని గూడ గ్రామపంచాయతీ హనుమాన్ టెంపుల్ కు వెళ్లే సీసీ రోడ్డు మార్గం ఇబ్బందికరంగా మారింది. సగం వరకు పనులు పూర్తి చేశారు. మిగతా సగం వదిలేశారు. ఈ పరిస్థితులతో నిత్యం అటుగా వెళ్లే చిన్నపిల్లలకు ప్రమాదకరంగా మారింది మ్యాన్ హోల్ తెరిచి ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉన్నది అని స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

మా ఇబ్బందులు తొలగించండి మహాప్రభు...

 సీసీ రోడ్డు సగం పూర్తి అవ్వడంతో మ్యానువోల్ తెరిచి ఉండడంతో ప్రమాదం పొంచి ఉన్నది. వర్షాలు పడ్డప్పుడు తెరిచిన మ్యానువోల్ ద్వారా రోడ్డుపై ఉన్న చెత్త చెదారమంతా, అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ లోకి వెళుతున్నది. కనుక తక్షణమే సంబంధిత శాఖ అధికారులు స్పందించి. సగం కాంక్రీట్ రోడ్ ని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. బుగ్గోనిగూడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు