పదో తరగతి లో పాసయ్యింది....ప్రేమికుడి చేతిలో ఓడిపోయింది

ఉరివేసుకొని మైనర్ బాలిక ఆత్మహత్య

పదో తరగతి లో పాసయ్యింది....ప్రేమికుడి చేతిలో ఓడిపోయింది

ప్రేమ పేరుతో మైనర్ బాలికను వంచించిన రవి

ప్రేమ వ్యవహారమే కారణంగా తేల్చిన శంషాబాద్ పోలీసులు 

నిందితుడు తెలగమల్ల రవి అరెస్ట్, కేసు నమోదు 

శంషాబాద్ (మం) లోని పెద్దతూప్ర లో ఘటన

రాజేంద్రనగర్, మే 18(నగరనిజం ప్రతినిధి): చదువుల బడిలో గెలిచింది... తోటి విద్యార్థులతో పోటీపడుతూ పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది.... బట్ ప్రేమికుడి చేతిలో వంచనకు గురైన ఆ అభాగ్యురాలు జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. మరోవైపు బాలిక ఆత్మహత్యకు కారకుడైన ప్రేమికుడిని శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్దతూప్ర గ్రామంలో చోటుచేసుకుంది. పెద్దతూప్ర గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ రూరల్ పోలీసులతో పాటు బాధితుల కథనం ప్రకారం వివరాలు....పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పెద్దతూప్ర గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక ఇటీవల పదవ తరగతి పరీక్షల్లో 474 మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అయితే అదే గ్రామానికి చెందిన తెలగమల్ల రవి (25) అనే యువకుడు ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా బాలిక వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకున్న నిందితుడు రవి....ఇటీవల బాలికను తన వెంట తీసుకెళ్లాడు.దీంతో బాలిక కుటుంబ సభ్యులు తమ కూతురు కనిపించడం లేదంటూ శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది బాలిక మైనర్ కావడంతో భయాందోళనకు గురైన రవి..... ఆమెను పెద్దతూప్ర గ్రామంలో వదిలేసి జారుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమికుడి చేతిలో ప్రేమ వ్యవహారం తో జీవితంలో ఓడిపోయానని కలత చెందిన బాలిక..... తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు....బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శనివారం నాడు పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడు రవిని అదుపులోకి తీసుకొని పోక్సో మరియు కిడ్నాప్ నేరం కింద కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంషాబాద్ పోలీసులు ప్రకటించారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్ ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్...
స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
ప్రమాదవశాత్తు ఆటోల నుండి పడి వ్యక్తి మృతి
మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్‌.. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు
అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి 
3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న
రోడ్డు వేయడం మర్చిపోయారు...?