స్నేహపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక
కాలనీ వాసుల సమక్షంలో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
స్నేహాపురి కాలనీ ప్రెసిడెంట్ గా ' గంగిడి రాంరెడ్డి ' ఎన్నిక
స్నేహపురి కాలనీ అభివృద్ధికి శక్తి,వంచన లేకుండా నిరంతరం కృషి
సహకరించిన ఎమ్మెల్యే, కాలనీ వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు
స్నేహపురి కాలనీ అభివృద్ధికి,సంక్షేమానికి నిరంతరం పాటుపడతా..
స్నేహపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగిడి రాంరెడ్డి
కాలనీ వాసుల సమక్షంలో నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం
ఇబ్రహీంపట్నం, జూన్ 8 ( నగరనిజం ) : తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్ లోని స్నేహాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గంగిడి రాంరెడ్డి ఎన్నికయ్యారు. కాలనీ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో గంగిడి రాంరెడ్డి తమ సమీప ప్రత్యర్థి కట్టా అచ్చుతా రెడ్డిపై గెలుపొందాడు. మొత్తం సుమారు కాలనీలో 125 ఓట్లు ఉండగా అందులో గంగిడి రాంరెడ్డికి 73, కట్టా అచ్చుతా రెడ్డికి 52 ఓట్లు వచ్చాయి. 21 ఓట్ల మెజారిటీతో గంగిడి రాంరెడ్డి విజయం సాధించాడు. ఈ సందర్భంగా గంగిడి రాంరెడ్డి విజయం సాధించడం పట్ల కాలనీ వాసులు ఆదివారం కాలనీలో నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం నిర్వహించారు. గౌరవ సలహదారులు వడ్ల భాస్కరాచారి అధ్యక్షతన నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్నేహాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా గంగిడి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తంగెల్ల సతీష్ రాజు, గౌరవ సలహాదారులుగా వడ్ల భాస్కరాచారి, చీఫ్ కోఆర్డినేటర్ గా ఆలేటి మల్లేశం, ఉపాధ్యక్షులుగా ఎడ్ల గౌరిశంకర్, పి.శ్రీపాల్, పి.తిరుపతయ్య, కార్యదర్శులుగా సీహెచ్ శ్రీనివాసచారి, యాదగిరి, వి.మురళీ మోహన్, కోశాధికారిగా ఎన్.శ్రావణ్ కుమార్, సహాకోశాధికారిగా సీహెచ్ మహిపాల్ రెడ్డి, కార్యానిర్వాహక కార్యదర్శులుగా ఎస్.రాజు గౌడ్, బి.శ్రీనివాస్, ఐలయ్య, ఎం.శాంతకుమారి, కార్యానిర్వాహక సభ్యులుగా ఎం.చంద్రశేఖర్ రెడ్డి, పి.సురేంద్ర, ఎం.రామకృష్ణా రెడ్డి, యు.శ్రీనివాస్, బి.మురళీ మోహన్, జి.శ్రీనివాస్ రెడ్డి, అహ్మద్ భాషా, పి.కల్పన శ్రీనివాస్ రెడ్డి, డి.అన్నపూర్ణ అంబయ్య, కె.సుచరిత గోవర్ధన్ రెడ్డి, తదితరులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతనంగా 3వ సారి ఎన్నికైన ప్రెసిడెంట్ గంగిడి రాంరెడ్డి మాట్లాడుతూ... గత 3 సంవత్సరాలుగా కాలనీ అభివృద్ధికి శక్తి వంచన కృషి చేశానని, ఎన్నో రకాల సేవలను కాలనీకి అందించానని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో స్నేహపురి కాలనీ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా అభివృద్ధి చెందడం జరిగిందన్నారు. ఇతర కాలనీలకు స్నేహపురి కాలనీ ఆదర్శం అన్నారు. కాలనీలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీలో తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి సహకారంతో కాలనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు. కాలనీలో ఎలాంటి ఇబ్బందులూ ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. కాలనీ సంక్షేమానికి అహర్నిశలు పాటుపడతానన్నారు. త్వరలో ఎమ్మల్యే మల్ రెడ్డి రంగారెడ్ది సహకారంతో కాలనీలో ఓపెన్ జిమ్ము, చిల్డ్రన్ పార్క్, ఐ లైట్స్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కల్పనపై నిరంతరం దృష్టి పెడతామన్నారు. కాలనీ అభివృద్ధికి కాలనీ వాసులంతా సహకరించాలన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మల్యే సహకారంతో కాలనీని మరింతగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీ వాసుల అభివృద్ధి,సంక్షేమమే తమ ధ్యేయమని అన్నారు. కాలనీనీ మరింతగా విస్తరించేందుకు శాయ,శక్తులా కృషి చేస్తానని తెలిపారు. మరోసారి నమ్మకముంచి ఓట్లు వేసి 3వ సారి గెలిపించిన కాలనీ వాసులుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సహకరించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి, తాజా మాజీ కౌన్సిలర్ బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కాలనీ సభ్యులను కాలనీ వాసులు శాలువాలతో ఘనంగా సన్మానించి, మెమొంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పెద్దలు, వివిధ కాలనీల ప్రెసిడెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.
Comments