ఫార్మాసిటీ రైతుల సమస్యలు పరిష్కరించండి
మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ఫార్మాసిటీ రైతుల సమస్యలు పరిష్కరించండి
రైతుభరోసా, రైతుభీమా పథకాలను వర్తింపజేయాలి
మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి బీఆర్ఎస్ నేతల వినతి
ఇబ్రహీంపట్నం, మే 29 ( నగరనిజం ) : ఫార్మాసిటీ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫార్మాసిటీ రైతులతో కలిసి రంగారెడ్ది జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి జిల్లా బీఆర్ఎస్ నేతలు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఫార్మాసిటీ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. రైతులకు ప్లాట్ల పోజీషన్ చూపించాలన్నారు. రైతుల అంగీకారం లేకుండా టీజీఐఐసీ పేరిట ఆన్లైన్ లో నమోదైన భూమిని వెంటనే తిరిగి రైతుల పేరిట మార్చాలన్నారు. రైతు భరోసా, రైతు భీమా పథకాలను వర్తింపజేయాలన్నారు. భూములు కోల్పోయిన రైతులకు మొత్తం భూమికి న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బలవంతపు భూ సేకరణను వెంటనే ఆపాలని కోరారు. ఫ్యూచర్ సిటి, ఫోర్త్ సిటీ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఫార్మాలో భూములు కోల్పోయిన రైతులకు పూర్తి న్యాయం చేయాలని కోరారు. ఫార్మాసిటీ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ త్వరలో ఫార్మా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కర్నాటి రమేష్ గౌడ్, భాష, రాంరెడ్డి, ప్రభాకర్, గంగాపురం లక్ష్మి నరసింహ రెడ్డి, రాజు నాయక్, గోవర్ధన్ నాయక్, శేఖర్ గుప్తా, సాయికిరణ్ రెడ్డి, హరికిషన్ రెడ్డి, మెరుగు రమేష్, కందుకూరి సాయి, శ్రీధర్ రెడ్డి, హాబీబుద్దీన్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Comments