ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు వరి విత్తనాలు పంపిణీ

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు వరి విత్తనాలు పంపిణీ

IMG-20250604-WA0890మేడ్చల్ జూన్ 03(నగరనిజం)మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ వారితో కలిసి నాణ్యమైన వరి విత్తనాలు రకం ఏమ్ టీయూ1010 లను 10కిలోల చొప్పున పూడూరు,రైలపూర్ రైతు వేదిక వద్ద రైతులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అగ్రికల్చర్ అధికారిని అర్చన మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరుతో రైతులకు అధిక పంట దిగుబడులు,రసాయనాల వాడకం వంటి తదితర అంశాలపై అవగాహన కల్పించడామే కాకుండా వరి విత్తనాలు పంపిణీ చేయడం గొప్ప విషయం అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ టి.లావణ్య,ఏవో అర్చన, ఏఈవోలు తేజస్విని,సుమిత,పీఎసీఎస్ చైర్మన్ లు రణదీప్ రెడ్డి,సురేష్ రెడ్డి,ఎఫ్ ఎసీఎస్ చైర్మన్ ఎన్ సుధాకర్ రెడ్డి,కాంగ్రెస్ మున్సిపల్,మండల అధ్యక్షులు వేముల శ్రీనివాస్,రమణారెడ్డి,మాజీ సర్పంచ్ దుడ్డు సంజీవ,మాజీ వార్డు సభ్యులు హన్మంత్ రెడ్డి,రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News