నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

మేడ్చల్:- గుండ్లపోచంపల్లి ఫీడర్, దూలపల్లి ఫీడర్ కింద శనివారం కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని గుండ్లపోచంపల్లి విద్యుత్ శాఖ ఏ.ఈ విజయకుమార్ తెలిపారు. గుండ్లపోచంపల్లి 11 కేవీ ఫీడర్ కింద ఉదయం 9 నుంచి 11 గంటల వరకు,దూలపల్లి 11 కేవీ కింద మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. దూలపల్లి ఫీడర్ కింద డీ.ఆర్.ఎస్ స్కూల్ ప్రాంతం, గుండ్ల పోచంపల్లి ఫీడర్ కింద దూలపల్లి రోడ్డు, గుండ్లపోచంపల్లి గ్రామం, ఇంటిగ్రిటీ హోమ్స్ లకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు ఇట్టి విషయంపై వినియోగదారులు సహకరించాలని కోరారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News