కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి నూతన చైర్మన్ ప్రమాణ స్వీకారం
కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ గా ఈదల కంటి సత్యనారాయణ రెడ్డి నియమితులైన సందర్భంగా దేవాలయంలో ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులు, విశిష్ట అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది.ఈ సందర్భంగా ఈదల కంటి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ… “హనుమాన్ స్వామి ఆశీస్సులతో ఈ పెద్ద బాధ్యత నాకు లభించింది. భక్తుల సౌకర్యం కోసం దేవాలయ అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగించడమే నా ప్రధాన లక్ష్యం. అన్నివర్గాల భక్తులకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందిస్తాం” అని తెలిపారు.ఇటీవల కాలంలో కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ఆలయ పరిసరాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో, ఆయన ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. భక్తుల కోసం ఉచిత అన్నప్రసాదం, తాగునీటి సదుపాయాలు, పార్కింగ్ వసతి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments