గ్రామాలలో విచ్చలవిడిగా బెల్టు దందా
తెల్లవారక ముందే ఏరులై పారుతున్న మద్యం
చెల్లా చెదురవుతున్న పల్లె ప్రజల జీవితాలు
అన్నీ తెలిసినా అటువైపు కన్నెత్తి చూడని
ఎక్సైజ్ అధికారులు
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం
మేడ్చల్ బ్యూరో / నగర నిజం: మేడ్చల్ మండలంలో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కొందరికి డబ్బులను ఎరగా వేస్తూ అమ్మకాలు చేయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో సైతం మద్యం ఏరులై పారుతోంది. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో ఏ గల్లికి వెళ్లిన తెల్లవారుజామునే మద్యం అందిస్తూ బెల్టు దందాను మూడు క్వార్టర్లు, ఆరు ఆఫ్లుగా సాగిస్తున్నారు. బెల్ట్ దుకాణాల నిర్వాహకులు క్వాటర్ పై రూ.30 నుంచి రూ.50ల వరకు వసూలు చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. మేడ్చల్ మండలంలోని అన్ని గ్రామాల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఎక్సైజ్ అధికారులకు అన్నీ తెలిసినా అటువైపు కన్నెతి చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై కొరడా ఝులిపించాలని ఆయా గ్రామాల్లోని మహిళలు, నివాస కుటుంబీకులు కోరుతున్నారు. మద్యం వ్యాపారులు వ్యూహాత్మకంగా, విచ్చల విడిగా బెల్ట్ షాపులను కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లైసెన్స్ పొందిన వ్యాపారులు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయిస్తుస్తున్నప్పటికీ.బెల్ట్ షాపుల పేరిట అక్రమ ఒప్పందాలు కుదుర్చుకుంటూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానం అమలులో భాగంగా లాటరీ పద్ధతుల్లో లైసెన్స్లను కేటాయించారు. లైసెన్స్లకు ప్రతీ వైన్స్కు అనుబంధంగా సిట్టింగ్ రూములకు పర్మిట్ ఇచ్చారు. అయితే గతంలో ఈ వ్యాపారాన్ని కొనసాగించిన వారికి లాటరీ పద్ధతిలో వైన్ షాపులు దక్కకపోవడంతో అక్రమ ఒప్పందాలు కొనసాగించి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో కొందరికి డబ్బులు ఎర చూపి బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. గ్రామ అభివృద్ధి పేరిట కొంత మొత్తాన్ని ఆయా గ్రామాలకు చెల్లిస్తుండడంతో బెల్ట్ షాపులు దక్కించుకున్న వ్యాపారులు అడ్డగోలు ధరలను నిర్ణయించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బహిరంగంగా వీడీసీల పాత్ర ఉన్న చోట ఈ రకమైన వ్యాపారాన్ని మద్యం వ్యాపారంలో పునీతులైన వారు కొనసాగిస్తుండగా వీడీసీలు లేని ప్రాంతాల్లో లైసెన్స్ దారులతో కుమ్మక్కై లాభాల్లో వాటాలను పొందుతూ అటు లైసెన్స్ దారులు ఇటు అక్రమ వ్యాపారులు తమ
వ్యాపారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మండలంలోని.బండ మాదారం,శ్రీరంగవరం,నూతన్ కల్,డబిల్ పూర్, రావల్కోల్,ఎల్లంపేట,పాటు రాజ బొల్లారం ఇలా చెప్పుకుంటూ పోతే మండలంలోని అన్ని గ్రామాలలో జోరుగా సిండికేట్ దందా నడుపుతున్నారు. లాటరీ పద్ధతిలో అనుభవం లేని వ్యక్తులకు సైతం వైన్ షాపులు దక్కడంతో వారికి కొంతమేర నగదును చెల్లించి వారి పేరిట మద్యం వ్యాపారంలో సిద్దహస్తులైన వారు తెర వెనుక నుండి ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఒకే సిండికేట్ ధరలకు ఎక్కువ షాపులు దక్కడంతో ఇతరులను సైతం తమలో కలుపుకొని . పట్టణ ప్రాంతాల్లో ఎంఆర్పీ ధరలకు మద్యం అమ్మకాలు సాగుతున్నప్పటికీ పల్లె ప్రాంతాల్లో మాత్రం అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియులను దోపిడికి గురి చేస్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకులు క్వాటర్పై రూ.30 నుంచి రూ.50 రూపాయల వరకు వసూలు చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ అక్రమ దందాకు అడ్డు లేకుండాపోయిందని చెబుతున్నారు. అడపాదడపా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారానే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రతిరోజు దినసరి కూలీలు, కార్మికులు
ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బెల్ట్ షాపుల బెడద
ఎక్కువగా ఉందంటున్నారు. మరిన్ని గ్రామాలలో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో గ్రామంలో బెల్ట్ షాపుకు లక్షల రూపాయలు ఆదాయం వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం మండలంలో ఎక్కడా బెల్ట్ షాపులు లేవని చెబుతున్నప్పటికీ మద్యం వ్యాపారానికి విధించే టార్గెట్ వీటి ద్వారానే
చేరుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎక్సైజ్
అధికారులకు ప్రతీ నెల మద్యం అమ్మకాల విషయమై
టార్గెట్ విధిస్తుండడంతో చూసి చూడనట్లు
వ్యవహరిస్తున్నటు ఆరోపణలున్నాయి. మొత్తానికి
మండలంలో బెల్ట్ షాపుల పేరిట మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ సిండికేట్ దారులు మద్యం ప్రియులను కొల్లగొడుతుండగా సంబంధిత అధికారులు మాత్రం చేతులు ముడుచుకుపోతూ ఉంటారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments