నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు
చాంద్రాయణగుట్ట / నగర నిజం : చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని తెలుగుదేశం పార్టీ జెండా వద్ద తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు తల్లికి తలనెత్తిన గౌరవం తీసుకొచ్చిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా డివిజన్ నాయకులు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు వేశారని, ఆయన చూపిన మార్గంలో ప్రతి కార్యకర్త నడవాలి అని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి, సమాజానికి ఆదర్శంగా నిలిచారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేయడం ప్రతి తెలుగుదేశం కార్యకర్త యొక్క బాధ్యత అని పేర్కొన్నారు. త్వరలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తిరిగి బలపరిచి అధికారంలోకి తీసుకురావాలని, ప్రతి ఒక్కరు గట్టి ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గురు ప్రసాద్, యాదిలాల్, జోగేందర్ సింగ్, బి వై శ్రీకాంత్, అజయ్ కుమార్, వెంకట్ సాయి వరం, భాను ప్రకాష్, యాదయ్య, స్థానిక పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments