ప్రమాదవశాత్తు ఆటోల నుండి పడి వ్యక్తి మృతి
Views: 239
On
మేడ్చల్ నగర నిజం:- మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ వైపు నుండి ఎన్ హెచ్ 44 వైపు వస్తున్న ఆటోలో వెనక కూర్చొని ప్రయాణిస్తున్న వ్యక్తి పేరు ఉత్తమ్ మారిబే షెరా, వయస్సు: 42 సంవత్సరాలు, గత నెల 24 తేదీన అంజాద ఉదయం 9:00 గంటల సమయంలో నజరీన్ గ్రామర్ పాఠశాల వద్ద కింద పడి తీవ్ర గాయాల పాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తేదీ:- 01/07/2025, ఉదయం మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించి మేడ్చల్ పోలీసులకు సమాచారం అందజేశారని మేడ్చల్ ఎస్సై అనిత తెలిపారు మరణించిన వ్యక్తికి సంబంధిత ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఫోటోలో ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆచూకీ ఎవరికైనా తెలిస్తే మేడ్చల్ పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని తెలిపారు
Tags:
About The Author
Related Posts
Post Your Comment

Latest News
24 Nov 2025 09:33:30
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...

Comments