తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా నుండి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ కోసం దరఖాస్తులు ఆహ్వానం

రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్రం, మహిళా, శిశు, వికలాంగుల , వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రంగారెడ్డి జిల్లా ప్రకటన ప్రకారం, ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP) చిల్డ్రన్ అవార్డ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ అవార్డ్స్ కోసం క్రీడలు, నూతన ఆవిష్కరణ, సామాజిక సేవ, పర్యావరణం, సామాజిక కళలు మరియు సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో ప్రతిభ చూపిన పిల్లలు అర్హులు.రంగారెడ్డి జిల్లా సంక్షేమ శాఖాధికారి  ఎల్. శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం, 5 సంవత్సరాల పైబడిన మరియు 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన, భారత పౌరసత్వం కలిగిన మరియు భారతదేశంలో నివసించే పిల్లలు ఈ అవార్డుకు అర్హులు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు **[https://awards.gov.in](https://awards.gov.in)** వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
దరఖాస్తులు **01-04-2025** నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. చివరి తేదీ **31-07-2025** వరకు మాత్రమే దరఖాస్తులను సమర్పించాలి.
వివరాలు తెలుసుకోవడానికి **[https://awards.gov.in](https://awards.gov.in)** వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News