‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’

అవార్డుకు ఎంపికైన పి.వెంకట్ రెడ్డి

‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’

హైదరాబాద్‌, జూన్‌ 11, (నగర నిజం): హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఈనెల 14న నిర్వహించనున్న ‘‘ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2025’’ కార్యక్రమంలో పునరుత్పాదక శక్తి రంగంలో విశేష కృషి చేసిన పి. వెంకట్‌ రెడ్డి కి ఇండియన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది  ఇయర్‌ - 2025’’ అవార్డు అందుకోబోతున్నారని నిర్వాహకులు తెలిపారు.‘‘ఇండియన్‌ ఐకానిక్‌ రిన్యూవబుల్‌ ఎనర్జీ పయనీర్ - 2025’’ కేటగిరీలో ఆయనను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తి వినియోగాన్ని విస్తరించేందుకు వెంకట్‌ రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.ఈ సందర్భంగా స్పందించిన వెంకట్‌ రెడ్డి, ‘‘ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది నా పరిశ్రమలో సాగిన ప్రయాణానికి గౌరవ సూచకంగా భావిస్తున్నాను. ఇది మరింత బాధ్యతతో ముందుకెళ్లేందుకు ప్రోత్సాహమిస్తుంది’’ అని అన్నారు.పలు విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి ఇండియన్‌ ఐకాన్‌ అవార్డులు ప్రతి ఏడాది ప్రదానం చేయడం ఆనవాయితీగా  కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News