3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు

3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న

ఎల్బీనగర్ , జూన్ 25, (నగర నిజం): రాచకొండ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ టీం (ఎస్ఓటి) ఎల్‌బీ నగర్ జోన్, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి ఎనుగు దంతాల (ఎలిఫెంట్ దంతాలు) అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన వ్యక్తి వివరాలు:

రేకులకుంట ప్రసాద్, వయస్సు: 32 సంవత్సరాలుInShot_20250625_151218297

వృత్తి: డ్రైవర్

నివాసం: రాజుల కాలనీ, రాయచోటికి చెందినవాడు (అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్)

స్వాధీనం చేసుకున్న ఆస్తి:

రెండు ఏనుగు దంతాలు (భారము: 5.62 కిలోలు)

ఒక మొబైల్ ఫోన్

ఈ దంతాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 3 కోట్ల రూపాయలు.

 జరిగిన ఘటన వివరాలు:

అరెస్టైన ప్రసాద్ మద్యం, మత్తు పదార్థాల వంటి చెడు అలవాట్లతో ఉన్నవాడిగా పోలీసులు గుర్తించారు. గతంలో తిరుపతి జిల్లా రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ కేసులోనూ ఇతడు అరెస్టయ్యాడు. అదే జైలులో మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరూ జైలులో స్నేహితులయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇద్దరూ కలసి శేశాచలం అడవుల్లోని యానాదుల గిరిజనుల వద్ద నుండి రెండు ఏనుగు దంతాలను కొనుగోలు చేసి, వాటిని హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్మాలని ప్లాన్ వేశారు. రాచకొండ పరిధిలోని ఎల్‌బీ నగర్‌కు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో వచ్చిన ప్రసాద్, మేకదంతాలను విక్రయించడానికి ప్రయత్నించాడు. ఈ సమాచారం ముందుగానే అందుకున్న ఎస్‌ఓటి ఎల్‌బీ నగర్ బృందం, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రెండు ఎనుగు దంతాలు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడు లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఆకస్మిక దాడి రాచకొండ పోలీసుల కఠిన నిఘా విధానాన్ని సూచిస్తోంది. స్మగ్లింగ్ వంటి అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టే క్రమంలో అధికారులు చూపిన చర్యలు ప్రశంసనీయం.ఈ చర్యలు రాచకొండ పోలీసు కమిషనర్ శ్రీ జి. సుదీర్ బాబు, ఐపీఎస్ పర్యవేక్షణలో, అదనపు డీసీపీ ఎస్‌ఓటీ ఎల్‌బీ నగర్ మహేశ్వరం శ్రీ ఎం.డి. షకీర్ హుస్సేన్, హయత్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ సాయిప్రకాష్‌ల మార్గదర్శకత్వంలో చేపట్టినట్లు సీపీ వెల్లడించారు.

 

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు