' పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి '

టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు

' పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి '

పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి

సుధీర్ఘ కాలంగా ఉద్యమిస్తున్న సంఘం కేవలం టీడబ్ల్యూజేఎఫ్ 

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే..

జర్నలిస్టుల సమస్యల సాధనకు సమిష్టిగా కృషి చేయాలి

చిన్నా, పెద్ద తేడాలేకుండా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి

అర్హులైన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి

ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలి

టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు

ఇబ్రహీంపట్నంలో టీడబ్ల్యుజేఎఫ్ డివిజన్ స్థాయి సమావేశం

పట్నం నియోజకవర్గ టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
 
ఇబ్రహీంపట్నం, జూన్ 3 ( నగరనిజం ) : పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టులు అనేకరకాల సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమరాశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీడబ్ల్యూజేఎఫ్ ఇబ్రహీంపట్నం డివిజన్ జనరల్ బాడీ సమావేశం మంగళవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగులూర్ హర్షిత గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య జిల్లాలో సుదీర్ఘ కాలంగా పెండింగులోనే కొనసాగుతోందని, కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చినా జిల్లా వ్యాప్తంగా ఇవ్వాల్సి ఉందన్నారు. జర్నలిస్టులో ఇళ్ల స్థలాలతో పాటు ఇతరేతర ప్రధాన సమస్యలన్నింటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితి విషయంతో పాటు విధివిధానాల రూపకల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. చిన్న పెద్ద పత్రికలను తేడా లేకుండా జర్నలిస్టులందరికీ అక్రిడియేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. హెల్త్ కార్డులను అందజేయాలని తెలిపారు. జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు రాయితీని వర్తింపజేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగిందని, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి జర్నలిస్టులందరికీ ఫీజు రాయితీ లెటర్లు అందజేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి జిల్లా విద్యాధికారికి లేఖ రాశారని గుర్తు చేశారు.  ప్రతి ఒక్క జర్నలిస్టు పాఠశాల ప్రారంభం కాగానే జిల్లా విద్యాధికారిని కలిసి లేటరు తీసుకునే ప్రయత్నం చేయాలని, ఒకవేళ్ళ జిల్లా విద్యాధికారి లేటర్ ఇవ్వకపోతే తమ దృష్టికి తేవాలన్నారు. తామంతా జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు అందుబాటులో ఉంటామని ప్రతి జర్నలిస్టుకు తమ పిల్లల చదువుల ఫీజు రాయితీ లీటర్లు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టు సంక్షేమమే కేంద్రంగా ప్రస్తుత అకాడమీ పెద్దలు పనిచేయాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల కోసం టీడబ్ల్యూజేఎఫ్ అనేక సంవత్సరాలుగా  ఉద్యమిస్తుందన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం అందరూ కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

*పట్నం నియోజకవర్గ టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక* 

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇబ్రహీంపట్నం డివిజన్ స్థాయి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా సిలివేరు యాదగిరి, పల్నాటి జగన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పంది శ్రీను, జుబ్బూరి కుమార్, గుండెమోని శివకుమార్, సహాయ కార్యదర్శులుగా ఎర్ర లింగం, నలపరాజు సైదులు, కోశాధికారిగా ఆలంపల్లి రవీందర్, ప్రచార కమిటీ సభ్యులుగా కందుకూరి నగేష్ ఎన్నికయ్యారు. త్వరలో జరుగుతున్న జిల్లా కమిటీకి ఇబ్రహీంపట్నం ప్రాంతం నుంచి పంది వెంకటేష్, పంది క్రాంతికుమార్, దుబ్బాక యాదగిరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జోగు శ్రీనివాసులు ఇబ్రహీంపట్నం డివిజన్ కమిటీ ప్రతిపాదించింది. ఈ సమావేశంలో ఫెడరేషన్ సీనియర్ నాయకులు చిలువేరు సురేష్, శ్రీశైలం, శంకర్, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News