న్యూ నాగోల్ లోని ఎస్సే డాంగే భవన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కొత్తపేట్/నగర నిజం : తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు న్యూ నాగోల్ లోని సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల కార్యాలయం ఎస్ ఎ డాంగే భవన్ లో దండు నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనబొడ్డుపల్లి కృష్ణ,( సిపిఐ రాష్ట్ర సబ్ కమిటీ మెంబర్) జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించారు. తెలంగాణ కోసం అమరవీరులైన కుటుంబాలకు నేటికీ న్యాయం జరగలేదని సకల జనులు ఉద్యమిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నేటికీ సకల జనులకు న్యాయం జరగటం లేదని విమర్శించారు. సబ్బండ వర్గాలు అనేక ఆశలు పెట్టుకుని జీవిస్తున్న వారి ఆశలు అడియాసలే చేస్తున్న పాలకవర్గాలను నిలదీయడానికి మరో సామాజిక తెలంగాణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉడుతల మల్లేష్, ఆర్ .యాదగిరి, సంగు సైదారావు, ఎండి పాషా మియా జి, అంజి తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Comments