మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల అచ్యుత్సాహం..,?

మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల అచ్యుత్సాహం..,?

IMG-20250610-WA0385*ఓవైపు మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్న పనితీరు మార్చుకొని వైనం*

*పత్తలేని ఫుడ్ సేఫ్టీ అధికారులు*

మేడ్చల్:-మేడ్చల్ మున్సిపాల్ పరిధి లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో గత వారం రోజులుగా ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మేడ్చల్ పురపాలక సంఘం అధికారులు దాడులు నిర్వహిస్తున్న ఇవన్నీ ఏమి పట్టనట్లు మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు ఇందుకు ఉదాహరణ మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని కృష్ణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సీజ్ చేసి మూడు రోజులు కాకముందే సదరు కృష్ణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి సంబంధించిన కిష్టాపూర్ లోని మరో బ్రాంచ్ లో సోమవారం సాయంత్రం ఈగలతో కూడిన ఆహార పదార్థాలను ఆహార ప్రియులకు వడ్డించారు ఓవైపు పురపాలక సంఘం అధికారులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహకులపై చర్యలు తీసుకుంటున్న నిమ్మకు నీరతనట్లు వ్యవహరిస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఇకనైనా ఆహార భద్రత తనిఖీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతో పాటు యజమానులపై ఆహార భద్రత చట్టం 2006,2011 సెక్షన్.51,52 నిబంధనల ప్రకారం ప్రజలకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించలేని సదరు హోటల్ నిర్వాహకులపై, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని ఆహార ప్రియులు ప్రజలు కోరుతున్నారు 

 *మేడ్చల్ పురపాలక సంఘం కమిషనర్ బట్టు నాగిరెడ్డి*

 గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న సోమవారం సాయంత్రం కృష్ణా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆహార పదార్థాలలో ఈగలు రావడం విషయంపై మున్సిపల్ కమిషనర్ని వివరణ కోరడంతో మీరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సదరు సెంటర్ పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇదే విషయంపై మీడియా ఎలా ఫిర్యాదు చేస్తది అని ప్రశ్నించగా సరే పరిశీలిస్తామంటూ నిర్లక్ష్యం సమాధానం తెలిపారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News