మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్‌.. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు

మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్‌.. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు

ఎల్లంపేట మున్సిపాలిటీ జూన్ 29:- మిషన్ భగీరథ పైప్ లైన్ కు బొక్క పడింది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహర్తించడంతో మిషన్‌ భగీరథ తాగునీరు వృధాగా పోతున్న సంఘటన ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి లోని మైసిరెడ్డిపల్లి లో వెలుగు చూసింది. మిషన్ భగీరథ పైప్ లైన్ కు బొక్క పడింది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహర్తించడంతో మిషన్‌ భగీరథ తాగునీరు వృధాగా పోతున్న సంఘటన మైసిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది స్వ

చ్ఛమైన మిషన్ భగీరథ తాగునీరు రోడ్డుపై వరదలా ప్రవహిస్తున్నా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పైప్ లైన్ కు పడిన రంధ్రం గుండా గ్రామానికి సంబంధించిన డ్రైనేజ్ పైపులోకి వెళుతుందని ఈ కలుషితమైన నీటిని తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బొక్క పడిన మిషన్ భగీరథ మంచినీటి పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

 చర్యలు చేపడతాం మున్సిపల్ కమిషనర్ :నిత్యానంద

సోషల్ మీడియా పరంగా వచ్చిన ఫిర్యాదు కు స్పందించిన ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ నిత్యానంద రేపటిలోగా మిషన్ భగీరథ మంచినీటి పైప్ లైన్ కు మరమ్మతులు చేయించాలని మిషన్ భగీరథ ఏ ఈ కి మైసిరెడ్డి పల్లి వార్డ్ ఆఫీసర్ రమణారెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్ ఏసిబికి పట్టుబడ్డ జీఎస్టీ ఆఫీసర్
నాంపల్లి, జూలై 8 (నగర నిజం): జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడిన కమర్షియల్ ట్యాక్స్ శాఖాధికారి ఏసీబీకి చిక్కాడు. మాదాపూర్ సర్కిల్‌లో డిప్యూటీ స్టేట్ ట్యాక్స్...
స్వామి వివేకానంద,దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
ప్రమాదవశాత్తు ఆటోల నుండి పడి వ్యక్తి మృతి
మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్‌.. రోడ్డుపై వృధాగా పోతున్న నీరు
అన్ని న్యాయస్థానాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలిని జనరల్ రిజిస్టార్ కు వినతి 
3 కోట్లు విలువైన ఏనుగు దంతాలు పట్టుకున్న
రోడ్డు వేయడం మర్చిపోయారు...?