కుంట్లూరు చౌరస్తా నుండి తట్టి అన్నారం నాగోల్ దారిలో ప్రమాదకర మలుపులు

కుంట్లూరు చౌరస్తా నుండి  తట్టి అన్నారం నాగోల్ దారిలో  ప్రమాదకర మలుపులు

కుంట్లూరు చౌరస్తా నుంచి తట్టి అన్నారం, నాగోల్ వైపు వెళ్లే రోడ్డులోని మూల మలుపులు రెండు మూడు చోట్ల ఉండడం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తున్నది. ఈ మలుపుల వద్ద దారిలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం, వీధి దీపాలు లేకపోవడం,స్పష్టమైన సూచికలు, రోడ్డుకు డివైడర్ సదుపాయం లేకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని స్థానికులు తెలిపారు. వాహనదారులు ఆటు, ఇటు నుంచి వాహనాలు వస్తున్నాయో తెలుసుకునే అవకాశం లేకుండా పోతుండటంతో ప్రాణహానికే అవకాశం ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా మారిన ఈ మలుపుల వద్ద తగిన సూచిక బోర్డులు, రోడ్డు డివైడర్ ఏర్పాట్లు చేయాలని కోరుతూ... ప్రభుత్వం స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు శాఖ అధికారులు ఇంతవరకూ స్పందించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంది..

.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

పలు గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు పలు గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు
మేడ్చల్ :- మేడ్చల్ మండలం వ్యవసాయ కార్యాలయ పరిధిలోని కండ్లకోయ, బండమాదారం, ఎల్లంపేట్, ఘన్‌పూర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేతాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.ఆచార్య జయశంకర్...
మేడ్చల్ పట్టణ ప్రాంతంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు
త్వరలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపడతాం
మేడ్చల్ నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు