మన్నెగూడలో మహోనియా హాస్పిటల్ ఘనంగా ప్రారంభం

మన్నెగూడలో మహోనియా హాస్పిటల్ ఘనంగా ప్రారంభం

InShot_20250514_135126104తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ రహదారిపై మహోనియా హాస్పటల్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, ఆరుట్ల మాజీ సర్పంచ్  కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, రాచర్ల వెంకటేష్, కోడూరి రమేష్, శ్రీనివాస్ నాయక్‌, ప్రజా ప్రతినిధులు, స్థానిక మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు హాజరై హాస్పటల్‌ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.InShot_20250514_133539658ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్యసేవలు అందుబాటులో ఉండేలా నూతన హాస్పటల్‌లు ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు. ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలకు అత్యవసర సమయంలో త్వరితగతిన వైద్యం అందేలా మహోనియా హాస్పటల్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక యువతికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ, సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. మహోనియా హాస్పటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్లు డాక్టర్ సువర్ణ, డాక్టర్ భాస్కర్ , మాట్లాడుతూ..., హాస్పటల్‌లో 24 గంటలు అత్యవసర సేవలు, జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనకాలజీ, పీడియాట్రిక్స్ వంటి విభాగాల్లో సేవలు అందించనున్నట్లు తెలిపారు. అధునాతన టెక్నాలజీ, అనుభవజ్ఞులైన వైద్యుల సహకారంతో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు.సామాన్య ప్రజలకు అందుబాటు ధరలతో, విశ్వసనీయ సేవలతో మహోనియా హాస్పటల్ ప్రజల్లో విశ్వాసం పొందేలా పనిచేస్తుందని తెలిపారు. ప్రజల సహకారంతో ఈ ఆసుపత్రిని ఈ ప్రాంతంలో ప్రముఖ వైద్యసంస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని హాస్పటల్ నిర్వాహకులు తెలిపారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

పలు గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు పలు గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు
మేడ్చల్ :- మేడ్చల్ మండలం వ్యవసాయ కార్యాలయ పరిధిలోని కండ్లకోయ, బండమాదారం, ఎల్లంపేట్, ఘన్‌పూర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేతాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.ఆచార్య జయశంకర్...
మేడ్చల్ పట్టణ ప్రాంతంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు
త్వరలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపడతాం
మేడ్చల్ నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు