మీర్పేట్, హయత్ నగర్ పోలీసుల విజయం

 మూడు గొలుసు దొంగతనాలు, రోబరీ కేసుల్లో ముగ్గురు నిందితుల అరెస్ట్

27.7 గ్రాముల బంగారు పుస్తెలతాడు, రెండు బైకులు స్వాధీనం

ఎల్.బి.నగర్ జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్, హయత్ నగర్ పోలీసులు మరియు సీసీఎస్ ఎల్.బి.నగర్ బృందం సంయుక్తంగా వ్యవహరించి మూడు గొలుసు దొంగతనాలు/రోబరీ కేసుల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 27.7 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.4 లక్షలు ఉంటుంది.

మీర్పేట్ కేసు వివరాలు:

నిందితుడు : కందనులు మల్లేశ్ @ గూడ్లనర్వ మల్లేశ్ (28), వృత్తి : సెంటరింగ్ వర్కర్, గ్రామం : గూడ్లనర్వ, బిజినపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా.
స్వాధీనం:

  • 20 గ్రాముల బంగారు పుస్తెలతాడు

  • హోండా ఎస్‌ఎఫ్-125 బైకు

కేసు వివరాలు:
జూలై 9న మధ్యాహ్నం 12:10 గంటల ప్రాంతంలో వందన్‌పురి కాలనీకి చెందిన చెవుల సంధ్య అనే మహిళా నివాసానికి నిందితుడు వచ్చినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట అద్దె గదుల కోసం అడిగి, అనంతరం ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. (క్రైం నం: 884/2025, సెక్షన్ 309(4), 305 బీఎన్ఎస్)

హయత్ నగర్ కేసు వివరాలు:

నిందితులు:

  1. రసాల శ్రీరాం (26), అమరావతి లికర్ మార్ట్ లో పనిచేస్తున్నాడు

  2. తిప్పరాజు అర్జున్ (24), ఆటో డ్రైవర్
    ఇద్దరూ హైదరాబాద్‌ లోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందినవారు.

స్వాధీనం:

  • 7.7 గ్రాముల బంగారు ఆభరణాలు (15 బీడ్లు, ఒక చింతపండు ఆకారపు లాకెట్)

  • సుజుకి అవెనిస్ 125 స్కూటర్

కేసు వివరాలు:
జూలై 8న సాయంత్రం 7:00 నుంచి 7:15 మధ్య హనుమాన్ నగర్ కాలనీ నుంచి స్వగ్రుహ కాలనీ వెంచర్‌కి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న పద్మ నర్సమ్మ (70) అనే వృద్ధ మహిళ మెడ నుంచి పుసల తాడు గొలుసును ఇద్దరు నిందితులు లాక్కొని స్కూటరుపై పరారయ్యారు. (క్రైం నం: 986/2025, సెక్షన్ 304(2) బీఎన్ఎస్)ఈ అరెస్టులు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ జి. సుధీర్ బాబు ఐపీఎస్ పర్యవేక్షణలో, ఎల్.బి.నగర్ డీసీపీ శ్రీ చి. ప్రవీణ్ కుమార్, రాచకొండ క్రైమ్స్ డీసీపీ శ్రీ వి. అరవింద్ బాబు, ఎడిషనల్ డీసీపీ బి. కోటేశ్వరరావు, ఏసీపీ వనస్థలిపురం డివిజన్ శ్రీ పి. కాశిరెడ్డి మరియు సంబంధిత పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, క్రైం టీంల సమిష్టి కృషితో చేపట్టిన సంఘటిత ఆపరేషన్‌లో భాగంగా జరిగింది.ఈ మంచి పని చేసిన మీర్పేట్, హయత్ నగర్ పోలీసులు మరియు సీసీఎస్ ఎల్.బి.నగర్ బృందాలను ఉన్నతాధికారులు ప్రశంసిస్తూ తగిన నష్టపరిహారం అందించనున్నట్లు డీసీపీ ఎల్.బి.నగర్ జోన్ తెలిపారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం
మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని...
ఫైనల్ కు చేరని సిఎంఆర్ ట్రోఫీ
నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమం
మార్కండేయ ఫంక్షన్ హాల్ లో పద్మశాలి ' పోపా ' క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ, పద్మశాలి సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు సన్మానం
బిసి రిజర్వేషన్ లపై ఎల్లంపేట్ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం