మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు

మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు

మేడ్చల్ :-హైదరాబాద్ లోని రామంతపూర్ లో విద్యుత్ షాక్ తో గత రాత్రి ఆరుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విద్యుత్ షాక్ తో మృతి చెందాడానికి ప్రధాన కారణం కేబుల్ వైర్లే అని విద్యుత్ అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలోని ప్రధాన రోడ్లు, వీధుల గుండా ఉన్న కేబుల్, ఇంటర్ నెట్ వైర్లను విద్యుత్ అధికారులు సోమవారం తొలగించారు. కాగా విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ కేబుల్, ఇంటర్ నెట్ వైర్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేబుల్ ఆపరేటర్లు ఉపేందర్,రాఘవేందర్, శ్రీనివాస్, నాయక్, చంద్రశేఖర్, శ్రీనివాస్ తెలిపారు.ఈ చర్యలకు నిరసనగా మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు మేడ్చల్ పట్టణంలో ఇంటర్ నెట్, కేబుల్ టీవీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నామని వారు పేర్కొన్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు