మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు

మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు

మేడ్చల్ :-హైదరాబాద్ లోని రామంతపూర్ లో విద్యుత్ షాక్ తో గత రాత్రి ఆరుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విద్యుత్ షాక్ తో మృతి చెందాడానికి ప్రధాన కారణం కేబుల్ వైర్లే అని విద్యుత్ అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో మేడ్చల్ పట్టణంలోని ప్రధాన రోడ్లు, వీధుల గుండా ఉన్న కేబుల్, ఇంటర్ నెట్ వైర్లను విద్యుత్ అధికారులు సోమవారం తొలగించారు. కాగా విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ కేబుల్, ఇంటర్ నెట్ వైర్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేబుల్ ఆపరేటర్లు ఉపేందర్,రాఘవేందర్, శ్రీనివాస్, నాయక్, చంద్రశేఖర్, శ్రీనివాస్ తెలిపారు.ఈ చర్యలకు నిరసనగా మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు మేడ్చల్ పట్టణంలో ఇంటర్ నెట్, కేబుల్ టీవీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నామని వారు పేర్కొన్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు గుర్రంగూడ వద్ద థార్ కారు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయాలు
తుర్కయంజాల్, అక్టోబర్ 12, (నగర నిజం):తుర్కయంజాల్ నుండి బి.ఎన్.రెడ్డి నగర్ వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని థార్ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం, తేదీ...
ఆర్డీఎస్ మినీ బంకేట్ హాల్ – అన్ని రకాల వేడుకలకు ఆకర్షణీయ వేదిక
డబిల్ పూర్ గ్రామంలో యాచకుడి మృతి
మైలార్ దేవ్ పల్లి లో బెడిసి కొట్టిన మర్డర్ వ్యూహం 
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు
మేడ్చల్ పట్టణ పరిధిలోని కిస్టాపూర్ లో కార్డన్ సర్చ్
కండ్ల కొయ్య ఆక్సిజన్ పార్క్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం