కుమ్మరి లక్ష్మయ్య మరణం తీరని లోటు పాఠశాల పూర్వ విద్యార్థులు
మేడ్చల్ నగరనిజం:- మేడ్చల్ పరిధిలోని శ్రీరంగావరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దశబ్ది కాలాల పాటుగా పాఠశాల శానిటరీ ఎంప్లాయిగా పనిచేస్తున్నటువంటి కుమ్మరి లక్ష్మయ్య శ్రీరంగవరం గ్రామానికి చెందిన వ్యక్తి కొద్ది రోజులుగా ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేక మంచాన పడ్డారు.ఈరోజు ఉదయం అనారోగ్యంతో మరణించారు పాఠశాల పూర్వ విద్యార్థులు వచ్చేనెల 4వ తేదీన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ కార్యక్రమానికి పాఠశాలలో విద్యార్థులకు ఎనలేని సేవలు అందించిన లక్ష్మయ్య ను సైతం ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు కానీ తన మరణం వార్త విన్న విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నట్లు. లక్ష్మయ్య విద్యార్థులకు చేసినటువంటి సేవను గుర్తుపెట్టుకుని తన కుటుంబానికి ఏదైనా విషయంలో సహాయంగా నిలుస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు
Comments