అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు

మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు:-శైలజ హరినాథ్

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు

 మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు మేడ్చల్ మున్సిపల్ పరిధిలో కొంత మందికి మాత్రమే ఇందరమ్మ ఇళ్లు మంజూరు చేయడంఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు మాట్లాడుతూ అర్హత కలిగిన వారికి ఇవ్వకుండా అన్యాయం చేశారని నిన్నటి రోజు మున్సిపల్ కార్యాలయం లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ఓ  కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ల జరిగినది అని అందులో ఉన్న మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా వ్యవహరించడం బాగులేదు అని అన్నారు.పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకునేది లేదని అన్యాయం చేసిన వారిని ప్రజలు క్షమించరని బీజేపీ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు జాకట ప్రేమ్ దాస్, కనుగంటి వంశీ విజయ్ కార్యదర్శి విష్ణుమూర్తి, సాయి కుమార్, నాయకులు రాఘవ రెడ్డి, నవీన్ కుమార్, వంశీధర్ రెడ్డి,నర్సింగ్ రావు,శ్రీపాల్ రెడ్డి, వెంకటేష్, గౌలికర్ మహేష్, కేశవా రెడ్డి,జాకట బాబు రాజు, తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Related Posts

Post Your Comment

Comments

Latest News

శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఘనంగా ప్రారంభం
హయత్ నగర్, 24,నవంబర్, (నగర నిజం) హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ను మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్...
నేటి నుంచే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్, రైసిన్ విష పదార్థం తయారీ
కొయ్యలగూడెంలో అయ్యప్ప సేవా ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహం
లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులుగా ఎదగండి