లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
By NAGARA NIJAM
Views: 420
On
హయత్ నగర్ ,నవంబర్ 3 (నగర నిజం): లక్ష్మారెడ్డి పాలెం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. నిన్న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తి క్యాండర్ షైన్ స్కూల్ ఎదురుగా ఉన్న ఎన్.హెచ్.65 హైవే రోడ్డు దాటుతుండగా, ఓ ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా అతడిని నీలాద్రి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.ఆ వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో, పోలీసులు గుర్తింపు కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తిస్తే, హయత్ నగర్ పోలీసు స్టేషన్ను సంప్రదించవచ్చు.
ఎస్ఐ లక్ష్మీనారాయణ – 8712662286
పీఎస్ హయత్ నగర్ – 8712662640
Tags:
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Latest News
15 Jan 2026 04:35:11
ఎల్లంపేట మున్సిపాలిటీ:-తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం పురపాలక శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది.ఎల్లంపేట మున్సిపాలిటీ...

Comments