సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

విజేతగా నిలిచిన మేడ్చల్ ప్రెస్ క్లబ్ టీం

సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

ఎల్లంపేట మున్సిపాలిటీ :-సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని బర్మాజిగూడలో గల యుక్త క్రికెట్ గ్రౌండ్ లో శుక్రవారం రోజు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. మేడ్చల్ ప్రెస్ క్లబ్, పొలిటికల్ లీడర్స్ టీమ్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగింది పొలిటికల్ లీడర్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 8 ఓవర్ల మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మేడ్చల్ ప్రెస్ క్లబ్ టీం 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో పొలిటికల్ లీడర్స్ టీం 8 ఓవర్లలో 40 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోగా. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో మేడ్చల్ ప్రెస్ క్లబ్ టీం 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి క్రికెట్ టోర్నీలో కేవలం గెలుపు ఓటములు మాత్రమే కాకుండా మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, మేడ్చల్ పొలిటికల్ లీడర్స్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీలకు ఆహ్వానం
మేడ్చల్ :-సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్- 2025 మేడ్చల్ రెవెన్యూ మండల స్థాయి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ క్రీడలు మేడ్చల్ రెవెన్యూ మండల కేంద్రంలోని...
ఫైనల్ కు చేరని సిఎంఆర్ ట్రోఫీ
నాగోల్ బండ్లగూడ ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమం
మార్కండేయ ఫంక్షన్ హాల్ లో పద్మశాలి ' పోపా ' క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ, పద్మశాలి సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు సన్మానం
బిసి రిజర్వేషన్ లపై ఎల్లంపేట్ మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు
సీఎంఆర్ క్రికెట్ టోర్నీ ప్రారంభం