తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో క్యాలండర్ ఆవిష్కరణ, పద్మశాలి సర్పంచ్ ఉపసర్పంచ్లకు సన్మానం
ఆదివారం ఎల్ బి నగర్లోని స్వకులశాలి భవన్లో
హైదరాబాద్ ఎల్ బి నగర్, 17, జనవరి, (నగర నిజం) : తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఎల్ బి నగర్లోని స్వకులశాలి భవన్లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పద్మశాలి సర్పంచ్లు, ఉపసర్పంచ్లకు సన్మాన మహోత్సవం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పాల్గొని చేనేత రంగ అభివృద్ధి, పద్మశాలి కుల ఐక్యతపై ప్రసంగిస్తారని తెలిపారు.. క్యాలండర్ ఆవిష్కరణ అనంతరం ప్రజాప్రతినిధులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కారం.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ శ్రేణులు, కులబాంధవులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కార్యక్రమ నిర్వహణలో రాపోలు వీరమోహన్, మాడం రామకృష్ణ, జెల్ల రఘు, రావిరాల శ్రీనివాస్ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment


Comments