మహిళలు వస్త్ర రంగంలో రాణిస్తారు: మర్రి శశిధర్ రెడ్డి
నాగోల్, 21 మార్చి (నగర నిజం) :మహిళలకు వస్త్ర రంగంపై పూర్తి అవగాహన ఉండటంతో వారు ఈ రంగంలో ఖచ్చితంగా రాణిస్తారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్లో స్వాతి రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తన్వీర షాపింగ్ మాల్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడటానికి వస్త్ర రంగం మంచి అవకాశాలను అందిస్తుందని చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని పేర్కొన్నారు.స్థానికంగా ఇలాంటి వ్యాపార సంస్థలు ఏర్పడటం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు. షాపింగ్ మాల్ నిర్వహణలో నాణ్యతతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి జాగృతి మహిళ అధ్యక్షురాలు నూకల పద్మా రెడ్డి, పావని రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.
మహిళలు వస్త్ర రంగంలో రాణిస్తారు: మర్రి శశిధర్ రెడ్డి
నాగోల్, 21 మార్చి (నగర నిజం) :మహిళలకు వస్త్ర రంగంపై పూర్తి అవగాహన ఉండటంతో వారు ఈ రంగంలో ఖచ్చితంగా రాణిస్తారని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్లో స్వాతి రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తన్వీర షాపింగ్ మాల్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలపడటానికి వస్త్ర రంగం మంచి అవకాశాలను అందిస్తుందని చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే ఈ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమని పేర్కొన్నారు.స్థానికంగా ఇలాంటి వ్యాపార సంస్థలు ఏర్పడటం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అన్నారు. షాపింగ్ మాల్ నిర్వహణలో నాణ్యతతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి జాగృతి మహిళ అధ్యక్షురాలు నూకల పద్మా రెడ్డి, పావని రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.
About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments