కురుమ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కురుమ యువ చైతన్య సమితి చర్చ
హైదరాబాద్, 11 మార్చి (నగర నిజం) : కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ను కలిసి కురుమ సమాజానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుండె వెంకటేష్ కురుమ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా కురుమ సమాజానికి రాజకీయ అవకాశాలు కల్పించాలి అనే అంశం తో పాటు సమాజానికి ఎదురవుతున్న పలు సమస్యలను రాష్ట్ర కమిటీ నాయకులు వివరించారు. వాటిపై రాంచందర్ రావు సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.భవిష్యత్తులో కురుమ కులానికి ప్రత్యేక గుర్తింపు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కురుమల సమస్యలను అధికార పక్షానికి తెలియజేస్తామని రాంచందర్ రావు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌడ రాజ్ కుమార్ కురుమ, ఉపాధ్యక్షుడు కొల్లు రమేష్ కురుమ, కోశాధికారి రావుల ఐలయ్య కురుమ, ప్రచార కార్యదర్శి కోడూరు అశోక్ కురుమ, రాష్ట్ర కార్యదర్శి రావుల ఐలయ్య కురుమ, కాల్నే మల్లేశం కురుమ, ఎల్బీనగర్ అధ్యక్షుడు బాలం శ్రీనివాస్ కురుమ, వర్కింగ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మందుల విద్యాసాగర్ కురుమ, ఉపాధ్యక్షులు బండారి శ్రీశైలం కురుమ, కడగంచి మల్లేశం కురుమ, ఎమ్మె నరేష్ కురుమ, మాలిగ శ్రీశైలం కురుమ, కడగంచి శంకర్ కురుమ తదితరులు పాల్గొన్నారు.

కురుమ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కురుమ యువ చైతన్య సమితి చర్చ
హైదరాబాద్, 11 మార్చి (నగర నిజం) : కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ను కలిసి కురుమ సమాజానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు కుండె వెంకటేష్ కురుమ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా కురుమ సమాజానికి రాజకీయ అవకాశాలు కల్పించాలి అనే అంశం తో పాటు సమాజానికి ఎదురవుతున్న పలు సమస్యలను రాష్ట్ర కమిటీ నాయకులు వివరించారు. వాటిపై రాంచందర్ రావు సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.భవిష్యత్తులో కురుమ కులానికి ప్రత్యేక గుర్తింపు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కురుమల సమస్యలను అధికార పక్షానికి తెలియజేస్తామని రాంచందర్ రావు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌడ రాజ్ కుమార్ కురుమ, ఉపాధ్యక్షుడు కొల్లు రమేష్ కురుమ, కోశాధికారి రావుల ఐలయ్య కురుమ, ప్రచార కార్యదర్శి కోడూరు అశోక్ కురుమ, రాష్ట్ర కార్యదర్శి రావుల ఐలయ్య కురుమ, కాల్నే మల్లేశం కురుమ, ఎల్బీనగర్ అధ్యక్షుడు బాలం శ్రీనివాస్ కురుమ, వర్కింగ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మందుల విద్యాసాగర్ కురుమ, ఉపాధ్యక్షులు బండారి శ్రీశైలం కురుమ, కడగంచి మల్లేశం కురుమ, ఎమ్మె నరేష్ కురుమ, మాలిగ శ్రీశైలం కురుమ, కడగంచి శంకర్ కురుమ తదితరులు పాల్గొన్నారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments