బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష

బిసి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గద్దె విజయ్ నేత సంఘీభావం

బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష

హైదరాబాద్, 28 ఫిబ్రవరి (నగర నిజం) : బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్, ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు నేతృత్వంలో ఏర్పాటు చేశారు.బీసీలకు సముచిత ప్రాతినిధ్యం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విధానాల్లో సమాన భాగస్వామ్యం కల్పించాలని దీక్షలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రత్యేక చర్యలు అవసరమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బిసి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గద్దె విజయ్ నేత సంఘీభావం తెలిపారు. టి. చిరంజీవులకు గద్దె విజయ్ నేత శాలువా కప్పి సన్మానించారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న ప్రతి పోరాటానికి తాము అండగా ఉంటామని ఆయన వెల్లడించారు.ఈ నిరాహార దీక్షలో బిసి సంఘం నాయకులు గుజ్జ సత్యం, దుర్గయ్య గౌడ్, బీసీ చెన్న శ్రీకాంత్, జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు వెంకన్న నేత పాల్గొన్నారు. ఇతర బీసీ నాయకులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

28 Feb 2026 06:54 AM
ఎల్ బి నగర్

బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష

బిసి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గద్దె విజయ్ నేత సంఘీభావం

హైదరాబాద్, 28 ఫిబ్రవరి (నగర నిజం) : బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఇకపై సహించబోమని స్పష్టం చేస్తూ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్, ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు నేతృత్వంలో ఏర్పాటు చేశారు.బీసీలకు సముచిత ప్రాతినిధ్యం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విధానాల్లో సమాన భాగస్వామ్యం కల్పించాలని దీక్షలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రత్యేక చర్యలు అవసరమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బిసి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ గద్దె విజయ్ నేత సంఘీభావం తెలిపారు. టి. చిరంజీవులకు గద్దె విజయ్ నేత శాలువా కప్పి సన్మానించారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న ప్రతి పోరాటానికి తాము అండగా ఉంటామని ఆయన వెల్లడించారు.ఈ నిరాహార దీక్షలో బిసి సంఘం నాయకులు గుజ్జ సత్యం, దుర్గయ్య గౌడ్, బీసీ చెన్న శ్రీకాంత్, జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు వెంకన్న నేత పాల్గొన్నారు. ఇతర బీసీ నాయకులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

www.nagaranijam.com 28 Feb 2026 06:54 AM
Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు శిథిలావస్థలో ఉన్న బోరుబావికి మరమ్మతులు
మేడ్చల్:- ఎల్లంపేట్  మున్సిపల్ పరిధిలోని 16వ వార్డునూతన్ కల్ గ్రామ పరిధిలో గల బోరుబావి గత సంవత్సరం కాలంగా సరైన మరమత్తులు లేక శిథిలావస్థకు చేరడంతో 16వ...
బీసీలకు న్యాయం చేయాలి – ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష
మెట్ పల్లి ఆర్డీవో నరసింహారావు 
మెట్ పల్లి మండల ఇన్చార్జి ఎంఈఓ గా ప్రధానోపాధ్యాయురాలు కనకతార 
మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్‌ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. నరసింహ చారి
కాంగ్రెస్ హామీలపై ప్రజలు ప్రశ్నించేలా పోరాటం చేయాలి
అమ్మవారిని దర్శించుకున్న మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి.