అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!

వార్డ్ ఆఫీసర్ రమణరెడ్డి నిర్లక్ష్యమే కారణం ఉంటున్న గ్రామస్తులు

అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!

ఎల్లంపేట్, మార్చి 13:-ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న రంగనాయక స్వామి, భవాని రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. జాతర నేపథ్యంలో గ్రామంలో వీధి లైట్ల సమస్య తలెత్తినప్పటికీ పలుమార్లు సమాచారం అందించినా అధికారులు స్పందించకపోవడంతో స్థానిక 17వ, కౌన్సిలర్ స్వయంగా విద్యుత్ స్థంబాలు ఎక్కి లైట్లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

జాతరకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో రాత్రి సమయంలో చీకటి కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యపై అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కౌన్సిలర్లు స్వయంగా ముందుకు వచ్చి లైట్లు అమర్చినట్లు తెలిపారు.

అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వార్డు ఆఫీసర్ రమణ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ సాలాం తీరుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతర వంటి ముఖ్యమైన వేడుకలో కూడా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.

ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

13 Mar 2026 12:02 PM
మేడ్చల్ మల్కాజ్‌గిరి

అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!

వార్డ్ ఆఫీసర్ రమణరెడ్డి నిర్లక్ష్యమే కారణం ఉంటున్న గ్రామస్తులు

ఎల్లంపేట్, మార్చి 13:-ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న రంగనాయక స్వామి, భవాని రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. జాతర నేపథ్యంలో గ్రామంలో వీధి లైట్ల సమస్య తలెత్తినప్పటికీ పలుమార్లు సమాచారం అందించినా అధికారులు స్పందించకపోవడంతో స్థానిక 17వ, కౌన్సిలర్ స్వయంగా విద్యుత్ స్థంబాలు ఎక్కి లైట్లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

జాతరకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో రాత్రి సమయంలో చీకటి కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సమస్యపై అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కౌన్సిలర్లు స్వయంగా ముందుకు వచ్చి లైట్లు అమర్చినట్లు తెలిపారు.

అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వార్డు ఆఫీసర్ రమణ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ సాలాం తీరుపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతర వంటి ముఖ్యమైన వేడుకలో కూడా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.

ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

www.nagaranijam.com 13 Mar 2026 12:02 PM
Tags:

About The Author

Post Your Comment

Comments

Latest News

అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు! అధికారుల నిర్లక్ష్యం… స్థంబాలు ఎక్కిన కౌన్సిలర్లు!
ఎల్లంపేట్, మార్చి 13:-ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో జరుగుతున్న రంగనాయక స్వామి, భవాని రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. జాతర...
కురుమ సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కురుమ యువ చైతన్య సమితి చర్చ
ఘనంగా ప్రాథమిక పాఠశాల లో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు
గ్రామాభివృద్ధే లక్ష్యం
మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రవిశంకర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక