భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ స్టాల్ ప్రారంభం
మన్సూరాబాద్, 21 మార్చి (నగర నిజం) : మన్సూరాబాద్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ తమ స్టాల్ను ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్పోలో వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొంటున్నాయి.నాగోల్ మమత నగర్ రోడ్ నంబర్ 3లో మేనేజింగ్ డైరెక్టర్ వీరభద్రం నేతృత్వంలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ ఈ స్టాల్ను ఏర్పాటు చేసింది. సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్, ఆర్.బి.ఏం శివ కుమార్ స్టాల్ను ప్రారంభించి బ్రోచర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వాహకుడు సంగమేశ్వర్ చారి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు అందుబాటు ధరల్లో ప్లాట్లు అందించాలనే లక్ష్యంతో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ను స్థాపించినట్లు చెప్పారు.సంస్థ వెంచర్లు జనగాం, ఆలేరు, సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. రాయల్ ట్రిపుల్ ఆర్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టులో భాగంగా గజం రూ.2999కు ప్లాట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు.ఎక్స్పో ప్రత్యేక ఆఫర్గా ఈ రెండు రోజులలో ప్లాట్ కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9440611564 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈ స్టాల్ ఎగ్జిబిషన్ లో నేహా, ప్రవళిక ,మంజు, అక్షయ, మార్కెటింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ స్టాల్ ప్రారంభం
మన్సూరాబాద్, 21 మార్చి (నగర నిజం) : మన్సూరాబాద్ లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న భారత్ వ్యాపార్ లైఫ్ స్టైల్ ఎక్స్పోలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ తమ స్టాల్ను ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్పోలో వివిధ రంగాలకు చెందిన సంస్థలు పాల్గొంటున్నాయి.నాగోల్ మమత నగర్ రోడ్ నంబర్ 3లో మేనేజింగ్ డైరెక్టర్ వీరభద్రం నేతృత్వంలో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ ఈ స్టాల్ను ఏర్పాటు చేసింది. సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్, ఆర్.బి.ఏం శివ కుమార్ స్టాల్ను ప్రారంభించి బ్రోచర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వాహకుడు సంగమేశ్వర్ చారి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు అందుబాటు ధరల్లో ప్లాట్లు అందించాలనే లక్ష్యంతో శ్రీ లిఖిత ప్రాపర్టీస్ను స్థాపించినట్లు చెప్పారు.సంస్థ వెంచర్లు జనగాం, ఆలేరు, సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. రాయల్ ట్రిపుల్ ఆర్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టులో భాగంగా గజం రూ.2999కు ప్లాట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు.ఎక్స్పో ప్రత్యేక ఆఫర్గా ఈ రెండు రోజులలో ప్లాట్ కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9440611564 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఈ స్టాల్ ఎగ్జిబిషన్ లో నేహా, ప్రవళిక ,మంజు, అక్షయ, మార్కెటింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment

Comments