సికింద్రాబాద్ వీధుల్లో 'సురక్షితాహారం' విప్లవం
500 మంది విక్రేతలకు ఫుడ్ సేఫ్టీ ట్రేనింగ్ అండ్ సర్టిఫికేషన్ శిక్షణ
మేడ్చల్ మార్చి 18(నగర నిజం)మన నగర వీధుల్లో దొరికే ఘుమఘుమలాడే స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ? అయితే, ఆ రుచికి 'సురక్షితం' అనే హామీ తోడైతే ? సరిగ్గా ఇదే లక్ష్యంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ముందడుగు పడింది. మంగళవారం సికింద్రాబాద్లో 500 మందికి పైగా వీధి ఆహార విక్రేతలకు ఫుడ్ సేఫ్టీ ట్రేనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ దక్షిణ ప్రాంత కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ, నగరంలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతికి నాంది పలికింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఆహారాన్ని విక్రయించే వారు కేవలం వ్యాపారులు మాత్రమే కాదని వేలాది మంది ప్రజలకు ఆహారాన్ని అందించే బాధ్యత కలిగిన వారన్నారు. ఆహారం విక్రయించే వ్యాపారులు పాటించే పరిశుభ్రత వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. అనంతరం ఆహార భద్రతా నిపుణులు డా. అంజనేయులు చాగంటి మాట్లాడుతూ ఆహార విక్రేతలకు క్షేత్రస్థాయిలో అవసరమైన మెళకువలను నేర్పించారు. ఆహరం వడ్డించే వారు చేతులు కడుక్కోవడంతో పాటు తలపాగాలు ధరించడంతో పాటు ఈగలు, దుమ్ము పడకుండా ఆహారాన్ని భద్రపర్చాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన ప్రతి విక్రేతకు ప్రత్యేక శిక్షణ కిట్లు అందజేశారు. అనంతరం శిక్షణ పొందిన పలువురు మాట్లాడుతూ ఇప్పటి వరకు మాకు రుచి గురించి మాత్రమే తెలుసు, కానీ ఈ శిక్షణ ద్వారా సురక్షితంగా ఆహారాన్ని ఎలా అందించాలో నేర్చుకున్నామని ఇది మాపై కస్టమర్లకు నమ్మకాన్ని పెంచుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణ అనంతరం శిక్షణ పొందిన మందికి ఫుడ్, హైజిన్ కిట్స్, ట్రైనింగ్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అదనపు కలెక్టర్ కధిరవన్ పలాని, ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలంగాణ డైరెక్టర్ బాలునాయక్ కేతవత్, ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలంగాణ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ వీధుల్లో 'సురక్షితాహారం' విప్లవం
500 మంది విక్రేతలకు ఫుడ్ సేఫ్టీ ట్రేనింగ్ అండ్ సర్టిఫికేషన్ శిక్షణ
మేడ్చల్ మార్చి 18(నగర నిజం)మన నగర వీధుల్లో దొరికే ఘుమఘుమలాడే స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ? అయితే, ఆ రుచికి 'సురక్షితం' అనే హామీ తోడైతే ? సరిగ్గా ఇదే లక్ష్యంతో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక అద్భుతమైన ముందడుగు పడింది. మంగళవారం సికింద్రాబాద్లో 500 మందికి పైగా వీధి ఆహార విక్రేతలకు ఫుడ్ సేఫ్టీ ట్రేనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ దక్షిణ ప్రాంత కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ, నగరంలో ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతికి నాంది పలికింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఆహారాన్ని విక్రయించే వారు కేవలం వ్యాపారులు మాత్రమే కాదని వేలాది మంది ప్రజలకు ఆహారాన్ని అందించే బాధ్యత కలిగిన వారన్నారు. ఆహారం విక్రయించే వ్యాపారులు పాటించే పరిశుభ్రత వల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. అనంతరం ఆహార భద్రతా నిపుణులు డా. అంజనేయులు చాగంటి మాట్లాడుతూ ఆహార విక్రేతలకు క్షేత్రస్థాయిలో అవసరమైన మెళకువలను నేర్పించారు. ఆహరం వడ్డించే వారు చేతులు కడుక్కోవడంతో పాటు తలపాగాలు ధరించడంతో పాటు ఈగలు, దుమ్ము పడకుండా ఆహారాన్ని భద్రపర్చాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన ప్రతి విక్రేతకు ప్రత్యేక శిక్షణ కిట్లు అందజేశారు. అనంతరం శిక్షణ పొందిన పలువురు మాట్లాడుతూ ఇప్పటి వరకు మాకు రుచి గురించి మాత్రమే తెలుసు, కానీ ఈ శిక్షణ ద్వారా సురక్షితంగా ఆహారాన్ని ఎలా అందించాలో నేర్చుకున్నామని ఇది మాపై కస్టమర్లకు నమ్మకాన్ని పెంచుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణ అనంతరం శిక్షణ పొందిన మందికి ఫుడ్, హైజిన్ కిట్స్, ట్రైనింగ్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, అదనపు కలెక్టర్ కధిరవన్ పలాని, ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలంగాణ డైరెక్టర్ బాలునాయక్ కేతవత్, ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలంగాణ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Your Comment

Comments