కొత్వాల్ చెరువు తండాలో తీవ్ర విషాదం
చెరువులో జారీపడి ఇద్దరు పిల్లలు మృతి
మృతులిద్దరూ ఆ తల్లులకు ఒక్కొక్కరే ఉండటం తీవ్ర విశాదం
మహేశ్వరం,ఫిబ్రవరి 02 (నగరనిజం) :కేసి తండాలో తీవ్ర విషాదం నెలకొంది మహేశ్వరం సిఐ హెచ్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి కే.సి తండా గ్రామానికి చెందిన రిషిత్, బద్రీనాథ్, శోభిత్, ముగ్గురు కలిసి ఆదివారం కావడంతో చెరువు సమీపంలో ఆడుకోవడానికి వెళ్లారు. చెరువు సమీపంలో ఉన్న కేసితండాకు చెందిన ఓ మహిళ వారిని బెదిరించడంతో ఆ మహిళను తప్పించుకొని మరో పక్క నుండి చెరువు దగ్గరికి వెళ్లారు. అంతలోనే బద్రీనాథ్, రిషి, చెరువులో జారిపడడంతో భయపడిన శోభిత్ చాకచక్యంగా ఇంటికి పరిగెత్తాడు. చెరువులో జారిపడ్డ ఇద్దరు పిల్లలు ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన ఫలితం లేకుండా పోయింది తప్పించుకున్న బాలుడు విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు చెరువు సమీపానికి చేరుకుని గాలింపు చేపట్టారు . ఆదివారం అర్ధరాత్రి వరకు మృతదేహాలు దొరకకపోవడంతో సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. మహేశ్వరం రెస్క్యూ టీం ఎంతోపాటు మహేశ్వరం కానిస్టేబుల్ శ్రీను చెరువు లోపలికి దిగి రిషి (6) బద్రీనాథ్ (8) మృతదేహాలను వెలికి తీశారు. దీంతో చెరువు సమీపంలోనే ఉన్న ఆ పిల్లల తల్లులు తమ కొడుకులు విగత జీవులుగా బయటకి రావడంతో రోదనలు మిన్నంటాయి. ఆ తల్లులకు ఒక్కొక్కరే కొడుకులు ఉండడం తీవ్ర విషాదాన్ని మిగిలించింది, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధనుంజయ్ తెలిపారు.

About The Author
ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Related Posts
Post Your Comment


Comments