హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుంట్లూర్ లో  ఘోర రోడ్డు ప్రమాదం

హయత్‌నగర్ /కుంట్లూర్/ నగర నిజం  : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో మంగళవారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నారాయణ కాలేజ్ (బాసర క్యాంపస్) సమీపంలో ఉదయం 5.45 గంటల సమయంలో స్కోడా కారు (నంబరు MH-02-DG-0771) , డీసీఎం వాహనం (నంబరు TS-07-UK-2664) ఒకదానికొకటి ఢీకొన్నాయి.పసుమాముల నుంచి కుంట్లూర్ వైపు వస్తున్న స్కోడా కారు, కుంట్లూర్ నుంచి పసుమాముల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం మధ్య నారాయణ కాలేజ్ సమీపంలో ఉన్న మలుపు వద్ద వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వారు:
పిన్నింటి చంద్రసేన రెడ్డి (24),
చుంచు త్రినాథ్ రెడ్డి (24),
చుంచు వర్షిత్ రెడ్డి (23) — అని గుర్తించారు.
ఇతర వ్యక్తి అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డి (24) గాయపడ్డాడు. గాయపడిన అతన్ని హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు, గాయపడిన వ్యక్తి  నలుగురూ కుంట్లూర్ నివాసితులుగా గుర్తించారు.ఈ ప్రమాదంపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Related Posts

Post Your Comment

Comments

Latest News

అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అర్హత లేని వారికి ఇచ్చారు
  మేడ్చల్ :-ఈ రోజు మేడ్చల్ మున్సిపల్ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను మాట్లాడుతూ నిన్నటి రోజు
మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్స్ సమావేశం
త్రాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నాం డబిల్ పూర్ గ్రామవాసులు
మేడ్చల్లో పురపాలక సంఘం కమిషనర్ల బదిలీలు
విరిగిన లారీ ఎక్సెల్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
మేడ్చల్ లో కేబుల్ వైర్లను తొలగించిన విద్యుత్ అధికారులు
లింగాపూర్ డబిల్ పూర్ గ్రామాల మధ్య రాకపోకల బందు