సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు పట్టివేత

సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు పట్టివేత

Picsart_25-05-13_19-40-01-973హయత్ నగర్ / నగర నిజం :  సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కొండం పార్థ సారధి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అవినీతి నిరోధక శాఖ అధికారులు , హయత్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఏసీబీ హైదరాబాద్ వారి Cr.No.06/RCO-ACB-NLG/2025 U/s 7(a) అవినీతి నిరోధక చట్టం-1988 (2018లో సవరణ) కింద నమోదు అయిన కేసులో డీఎస్పీ కొండం పార్థ సారధి, సూర్యాపేట టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. వీర రాఘవులుపై కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా మే 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎస్పీ నివాసమైన దత్తాత్రేయ నగర్, బాగ్ హయత్ నగర్‌లో ఉన్న ఇంటిని ఏసీబీ సిటీ రేంజ్-2 టీమ్ సోదా చేసింది.సోదాల్లో డీఎస్పీ ఇంట్లో 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లు, ఒక కాట్రిడ్జ్‌ల స్టాండ్ వంటి మందుగుండు సామాగ్రి అక్రమంగా ఉన్నట్లు కనుగొన్నారు. దీనిపై అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అవినీతి నిరోధక శాఖ ఇన్‌స్పెక్టర్ మురళీ మోహన్ ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు Cr.No: 613/2025 U/s: 25 (1A) (1AA) r/w 7 ARMS Act 1959 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తెలిపారు.ఇంతకుముందు సూర్యాపేటలోని ఒక డయాగ్నస్టిక్ స్కానింగ్ సెంటర్ సంబంధించిన కేసులో నిందితుడిని రిమాండ్‌కు పంపకుండా  16 లక్షల లంచం అడిగిన ఘటనపై ఏసీబీకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించారు. అదే సమయంలో మందుగుండు సామగ్రి వెలుగు చూసినట్లు హయత్ నగర్ పోలీసులు , ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

Tags:

About The Author

NAGARA NIJAM Picture

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం 
న్యూస్ పోర్టల్

Post Your Comment

Comments

Latest News

మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు మారిన మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు
మేడ్చల్:- మేడ్చల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్లు మారినట్లు విద్యుత్ శాఖ మేడ్చల్ ఏ.డి రాజ మల్లేష్ తెలిపారు కావున ఏదైనా...
నడిరోడ్డుని బ్లాక్ చేసిన నల్గొండ పోలీసులు
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమా?
మొద్దు లచ్చిరెడ్డికి సమస్యలపై వినతిపత్రం అందజేసిన గౌతమి నగర్ కాలనీ వాసులు
రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హయత్‌నగర్‌లో నివాళులు
బీసీల చైతన్యానికి గ్రామపర్యటనలు
రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మేడ్చల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు