మేడ్చల్
యూరియా వాడకం తగ్గించడం వల్ల నేలతల్లిని కాపాడుకోవచ్చని, డాక్టర్ వి వరప్రసాద్ అన్నారు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా మండలంలోని అక్బర్జపేట, గుండెపోచంపల్లి, రాయిలాపూర్, మేడ్చల్ గ్రామాలలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అవసరానికి మించి రసాయన ఎరువులు వాడకూడదని తెలిపారు సాగునీటిని ఆదా చేయడం పంట మార్పిడి చేయడం వలన చీడపీడలను తగ్గించవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు. వి సౌమ్య,పరశురాం, సంతోషి, లావణ్య,జి సాయిరాం,మణికంఠ, ఎస్ సౌమ్య, వై రోహిణి,వ్యవసాయ శాఖ అధికారులు అర్చన, వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారిని ఎస్ తేజస్విని, పంచాయతీ కార్యదర్శి స్వరూప,రైతులు,బి శ్రీనివాస్, పద్మారావు, గుంటి రమేష్, వెంకట్ రామిరెడ్డి, చీర్ల రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు