తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం
పెద్ద అంబర్పేట్: తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం పెద్ద అంబర్పేట్లోని వీఆర్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, స్థానిక శాసనసభ సభ్యుడు మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంపీ మల్లు రవి, కోదండరాం, హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ... పంచాయతీ కార్యదర్శులు గ్రామీణాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని, వారి సేవలకు ప్రభుత్వం పూర్తి గుర్తింపు ఇస్తుందని పేర్కొన్నారు. తగిన ప్రోత్సాహకాలు, భద్రత, వేతనాల పెంపు అంశాలపై ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.ఈ సమ్మేళనంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు, సంఘ ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలు, సూచనలు పంచుకున్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్