రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న డి.ఆర్.డిఎ.పిడి.శ్రీలత
రంగారెడ్డి జిల్లా/నగర నిజం: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా అమలు చేస్తున్న బ్యాంక్ లింకేజీ రుణాలను రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 112% శాతం అందించినందుకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులను అందుకున్నారు. గురువారం నాడు తెలంగాణ ప్రజా భవన్ లో నిర్వహించిన 2025-26 ఆర్థిక సంవత్సర బ్యాంక్ లింకేజీ లక్ష్యాలను, వార్షిక ప్రణాళికలను పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ సీఈవో దివ్య దేవరాజన్ తో కలిసి మంత్రి ప్రారంభించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో గత 2024 - 25 ఆర్థిక సంవత్సరం నాటికి 15,571 సంఘాలకు 850 కోట్ల 42 లక్షల టార్గెట్ కు 959 కోట్ల 18 లక్షల అందజేశారు. దీని 112% శతం చేదించినందుకు అవార్డు రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి బ్యాంక్ అధికారులు, అడిషనల్ డి ఆర్ డి ఓ సూర్యారావు,డిపిఎం బాలరాజు, ఏపీఎంలు సత్యనారాయణ, యాదగిరి, జిల్లా సమైక్య కార్యదర్శి కవిత, సిసి వినోద్ , అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్