బుద్ధ నగర్ లో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభం
మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధ నగర్ రోడ్ నెంబర్ 4 లో బొజ్జ రత్నాకర్ రెడ్డి నేతృత్వంలో కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిలుగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్ విచ్చేసి,మాజీ కార్పొరేటర్లు భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, మద్ది యుగేందర్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు యాజమాన్యాన్ని అభినందించారు.కేర్ వన్ ఫిజియోథెరపీ యాజమాని ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బొజ్జ రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ... ఇది తమ రెండవ బ్రాంచ్ అని, తమ కేర్ వన్ ఫిజియోథెరపీ క్లినిక్ లో మెడ నొప్పి,కండరాల నొప్పి,భుజం నొప్పి,మోకాళ్ళ నొప్పి,పార్కిన్ సోనిజమ్,బెల్స్ పాల్సీ,స్పోర్ట్స్ ఇంజురీస్,ఫ్రాక్చర్స్,డిస్క్ ప్రాబ్లమ్స్ లకి చికిత్స చేస్తామన్నారు. హోమ్ విజిట్ సదుపాయం కూడా అందుబాటులో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి మద్ది యుగేందర్ రెడ్డి,ఫిజియోథెరపీ యాజమాన్యం,కాలనీ వాసులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.