డిజిటల్ కార్డు తో నడిచే ఈ మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ నారాయణ రెడ్డి దాతలను అభినందించారు.
By NAGARA NIJAM
Views: 9
On
రంగారెడ్డి జిల్లా : శ్రీ రంగాపూర్ లో దాతల సహకారంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన రక్షిత మంచినీటి పథకాన్ని మంగళవారం షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం శ్రీరంగాపూర్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి ప్రారంభించడం జరిగింది.డిజిటల్ కార్డు తో నడిచే ఈ మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ నారాయణ రెడ్డి దాతలను అభినందించారు. రక్షిత మంచినీటి పథకం దాతలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్, కొందుర్గు మండలం మాజీ సింగల్ విండో డైరెక్టర్ బిమిడి అశోక్ రెడ్డి ఈ కార్యక్రమం లో షాద్ నగర్ ఆర్ డి ఓ సరిత, తహసీల్దార్ రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

ప్రజల సమస్యలపై సామాజిక రాజకీయ వ్యాపార విశ్లేషణ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ వార్తలను మీ ముందుకు వచ్చిన నగర నిజం
న్యూస్ పోర్టల్
Latest News
09 May 2025 18:25:07
మేడ్చల్ వివాహ వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘాం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని...